congress: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల... మరో 10 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు

  • జూబ్లీహిల్స్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి
  • తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనున్న దాసోజు శ్రవణ్
  • ఇంకా సస్పెన్స్ లోనే పొన్నాల లక్ష్మయ్య టికెట్

మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో టికెట్లను ఖరారు చేసుకున్న అభ్యర్థులు వీరే.

  • ఖానాపూర్ (ఎస్టీ) - రమేష్ రాథోడ్
  • ఎల్లారెడ్డి - జాజల సురేందర్
  • ధర్మపురి (ఎస్సీ) - అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి
  • మేడ్చల్ - కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  • ఖైరతాబాద్ - దాసోజు శ్రవణ్
  • జూబ్లీహిల్స్ - పి. విష్ణువర్ధన్ రెడ్డి
  • షాద్ నగర్ - సి. ప్రతాప్ రెడ్డి
  • భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి
  • పాలేరు - ఉపేందర్ రెడ్డి

టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయనుండటం గమనార్హం. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఈ జాబితాలో కూడా చోటు దక్కకపోవడం విశేషం. రమేష్ రాథోడ్ కు టికెట్ ఇవ్వరాదంటూ ఆయన ప్రత్యర్థులు ఆందోళనకు దిగినప్పటికీ... హైకమాండ్ పట్టించుకోలేదు.

  • Loading...

More Telugu News