Congress: ఎట్టకేలకు వచ్చేసిన కాంగ్రెస్ తొలి జాబితా.. అర్ధరాత్రి తర్వాత విడుదల

  • 65 మందితో విడుదలైన తొలి జాబితా
  • 23 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే
  • 10 మంది మహిళలకూ చోటు

రెండు వారాల సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. మొదట అనుకున్నట్టు 74 మందితో కాకుండా 65 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేశారు. మరోవైపు టీడీపీ కూడా 9 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సోమవారం రాత్రి 11 గంటల వరకు జాబితాపై కసరత్తు చేశారు. గతంలో కాంగ్రెస్‌పై రెబల్స్‌గా పోటీచేసిన వారు, ఇటీవల పార్టీలో చేరిన వారిని, గతంలో భారీ తేడాతో ఓడిన వారిని జాబితా నుంచి పక్కన పెట్టడంతో అభ్యర్థుల సంఖ్య 74 నుంచి 65కు తగ్గింది. ఈ జాబితాకు కాంగ్రెస్ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ దాదాపు టికెట్ లభించింది. పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డికి జాబితాలో చోటు దక్కలేదు.

కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో 23 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అలాగే, పదిమంది మహిళలు కూడా ఉన్నారు. మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న జానారెడ్డి కుమారుడిని పక్కనపెట్టారు. రాజేంద్ర నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా పెండింగ్‌లోనే ఉంది.  కాంగ్రెస్ ప్రకటించిన 65 స్థానాల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి 23 సీట్లు కేటాయించగా, 13 మంది బీసీలకు టికెట్ లభించింది. దీంతో మిగిలిన 29 సీట్లలో 13 మంది బీసీలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.  

కాంగ్రెస్ ప్రకటించి తొలి జాబితాలోని అభ్యర్థులు వీరే..
 
 
సిర్పూర్ : పాల్వాయి హరీశ్ బాబు
చెన్నూరు : వెంకటేశ్ నేత బోర్లకుంట
మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
ఆసిఫాబాద్ : ఆత్రం సక్కు
ఆదిలాబాద్ : సుజాత గండ్రత్
నిర్మల్ : అల్లేటి మహేశ్వర్ రెడ్డి
ముదోల్ : రామారావు పటేల్ పవార్
ఆర్మూర్ : ఆకుల లలిత
బోధన్ : పి. సుదర్శన్ రెడ్డి
జుక్కల్ : ఎస్. గంగారం
బాన్సువాడ : కాసుల బాలరాజు
కామారెడ్డి : షబ్బీర్ అలీ
జగిత్యాల : జీవన్ రెడ్డి
రామగుండం : ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
మంథని : శ్రీధర్ బాబు దుద్దిళ్ల
పెద్దపల్లి : సి. విజయ రమణారావు
కరీంనగర్ : పొన్నం ప్రభాకర్
చొప్పదండి : మేడిపల్లి సత్యం
వేములవాడ : ఆది శ్రీనివాస్
మానకొండూరు : ఆరేపల్లి మోహన్
ఆందోల్ : దామోదర రాజనర్సింహ
నర్సాపూర్ : సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్ : గీతారెడ్డి
సంగారెడ్డి : జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
గజ్వేల్ : వంటేరు ప్రతాప్ రెడ్డి
కుత్బుల్లాపూర్ : కూన శ్రీశైలం గౌడ్
మహేశ్వరం : పి. సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల : కేఎస్ రత్నం
పరిగి : రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ : గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు : పైలట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్ : ఎం. అనిల్ కుమార్ యాదవ్
నాంపల్లి : ఫిరోజ్ ఖాన్
గోషామహాల్ : ముకేశ్ గౌడ్
చార్మినార్ : మహ్మద్ గౌస్
చాంద్రాయణగుట్ట : ఇసా బినోబాయిద్ మిస్రీ
సికింద్రాబాబ్ కంటోన్మెంట్ : సర్వే సత్యనారాయణ
కొడంగల్ : రేవంత్ రెడ్డి
జడ్చర్ల : మల్లు రవి
వనపర్తి : జి. చిన్నారెడ్డి
గద్వాల : డీ.కే అరుణ
అలంపూర్ : సంపత్ కుమార్
నాగర్ కర్నూలు : నాగం జనార్దన్ రెడ్డి
అచ్చంపేట : సీ.హెచ్ వంశీకృష్ణ
కల్వకుర్తి : వంశీ చంద్‌రెడ్డి
నాగార్జున సాగర్ : జానారెడ్డి
హుజుర్ నగర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ : పద్మావతి రెడ్డి
సూర్యాపేట : ఆర్. దామోదర్ రెడ్డి
నల్గొండ : కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
మునుగోడు : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి : కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నకిరేకల్ : చిరుముర్తి లింగయ్య
ఆలేరు : భిక్షమయ్య గౌడ్
స్టేషన్ ఘన్‌పూర్ : సింగపూర్ ఇందిర
పాలకుర్తి : జంగా రాఘవరెడ్డి
డోర్నకల్:  జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్ : పోరిక బలరాం నాయక్
నర్సంపేట : దొంతి మాధవ్ రెడ్డి
పరకాల : కొండా సురేఖ
ములుగు : డి. అనసూయ అలియాస్ సీతక్క
పినపాక : రేగ కాంతారావు
మధిర : మల్లు భట్టి విక్రమార్క
కొత్తగూడెం : వనమా వెంకటేశ్వరరావు
భద్రాచలం : పోడెం వీరయ్య

  • Loading...

More Telugu News