karthikeya: కార్తికేయ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్లు

  • కార్తికేయ హీరోగా 'హిప్పీ'
  • తెలుగు .. తమిళ భాషల్లో చిత్రీకరణ 
  • నిర్మాతగా కలైపులి థాను  

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ఆయన తెలుగు .. తమిళ భాషల్లో 'హిప్పీ'అనే ఒక సినిమా చేస్తున్నాడు. కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి టి.ఎన్.కృష్ణ దర్శకుడిగా  వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు కథానాయికలు అవసరమట.కొత్త కథానాయికలు అయితేనే బాగుంటుందని భావించిన దర్శకుడు, ఒక హీరోయిన్ గా 'దిగాంగణ సూర్యవన్షి' (పై ఫోటోలో వున్న యువతి)ని .. మరో కథానాయికగా 'జాబ్జా సింగ్' ను తీసుకున్నారట. ఈ ఇద్దరు కథానాయికలు ఈ సినిమాతో తెలుగు .. తమిళ తెరకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకి కూడా చేరువవుతాననే బలమైన నమ్మకంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.        

  • Loading...

More Telugu News