Kurnool District: టీడీపీ మండలాధ్యక్షుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు

  • శుక్రవారం అర్ధ రాత్రి ఘటన
  • వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి వేళ టీడీపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. దేవనకొండ మండలం కె.వెంకటాపురం శివారులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..  మండల టీడీపీ అధ్యక్షుడైన సోమేశ్వర గౌడ్‌కు దేవనకొండలో ఓ మద్యం షాపు ఉంది. రాత్రి షాపు మూసేసిన అనంతరం కుమారుడితో కలిసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో కాపు కాసిన ప్రత్యర్థులు సోమేశ్వర్ కంట్లో కారం చల్లి హత్య చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా వేటకొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపారు. ఈ ఘటనలో ఆయన కుమారుడు శివ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News