shankar: '3.ఓ' కూడా ఉంటుంది .. కథపై పూర్తి క్లారిటీ రావాలి: దర్శకుడు శంకర్

  • నాపై చాలా వత్తిడి ఉండేది
  • ఫ్యాన్స్ అంచనాల గురించే ఆలోచన
  • నా టీమ్ ప్లానింగ్ బాగుండేది   

శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా వేగంగా జనంలోకి దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి శంకర్ మాట్లాడారు. "ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం వలన నాపై ఒత్తిడి బాగానే వుండేది. అయితే నా టీమ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం వలన నేను ఆ వత్తిడిని తట్టుకుంటూ సులభంగా పనిచేయగలిగాను.

రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ అంచనాలు ఏ స్థాయిలో వుంటాయో ఊహించగలను. అందువలన ఆ అంచనాలను అందుకునేలా కష్టపడుతూ వచ్చాను. 'రోబో' సీక్వెల్ గా '2.ఓ' వస్తోంది .. ఇక '3.ఓ' వచ్చే అవకాశం కూడా వుంది. ఇప్పుడిప్పుడే అందుకు సంబంధించిన కథను అల్లుకుంటూ వస్తున్నాను. పూర్తి కథను సిద్ధం చేసుకుని .. ఆ కథపై నాకు పూర్తి క్లారిటీ వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టును గురించి చెబుతాను" అని అన్నారు. 'భారతీయుడు 2' తరువాత '3.ఓ' ఉంటుందేమో చూడాలి మరి.  

  • Loading...

More Telugu News