rajani: శంకర్ ను నమ్మి 600 కోట్లు పెట్టారు .. అతను హిట్ కొడతాడు!: రజనీకాంత్

  • 300 కోట్లు అనుకుంటే 600 కోట్లు అయింది 
  • ఖర్చుకు నిర్మాతలు వెనకడుగు వేయలేదు
  • మధ్యలో నేను అనారోగ్యం పాలయ్యాను

శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి రజనీకాంత్ మాట్లాడుతూ .. "ఈ విశ్వం మానవులకి చెందినది మాత్రమే కాదు .. పశుపక్ష్యాదులకి చెందినది కూడా. సమాజాన్నీ .. పర్యావరణాన్ని మోడ్రన్ టెక్నలాజి ఎలా నాశనం చేస్తుందనే విషయంపై శంకర్ నాకు ఈ సినిమా కథ చెప్పాడు.

ఈ కథను శంకర్ అద్భుతంగా తీయగలడు అనే విషయం నాకు తెలుసు. అందుకే సాధ్యపడుతుందా అని నేను అడగలేదు .. నిర్మాత ఎవరు? అని మాత్రమే అడిగాను. 300 కోట్లతో చేయాలనుకున్న ఈ సినిమాకి 600 కోట్లవరకూ అయింది. అయినా నిర్మాతలు వెనకడుగు వేయలేదు .. అందుకు కారణం వాళ్లకి శంకర్ పై గల నమ్మకం. మధ్యలో నేను కాస్త అనారోగ్యం పాలైనా దర్శక నిర్మాతలు నాకు ధైర్యం చెప్పి ప్రాజెక్టును ముందుకు నడిపించారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News