puri: పూరి తనయుడు హీరోగా మరో మూవీ

  • హీరోగా 'మెహబూబా' చేసిన ఆకాశ్ 
  • నటన పరంగా ఆకాశ్ ఓకే  
  • నష్టాల బారిన పడిన పూరి

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ ను హీరోగా పెట్టి 'మెహబూబా' సినిమా చేశాడు. నటన పరంగా ఈ సినిమా ఆకాశ్ కి మంచి మార్కులు తెచ్చిపెట్టింది గానీ, లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఈ సినిమా కారణంగా పూరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడ్డాడనే వార్తలు షికారు చేశాయి. మళ్లీ ఆకాశ్ తో సినిమా వుంటుందో లేదోనని అనుకున్నారు. కానీ ఆకాశ్ హీరోగా ఒక సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం.

పూరి ఆఫీసులో ఒక కథపై కసరత్తు జరుగుతోందట. ఈ కథను ఆకాశ్ కోసమే సిద్ధం చేస్తున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమాకి పూరి దర్శకత్వం వహించడం లేదట. ఒక కొత్త కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమా పూరి సొంత బ్యానర్లో రూపొందుతుందా? లేదంటే మరో నిర్మాత నిర్మిస్తున్నారా? అనే విషయంలోనే క్లారిటీ రావలసి వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News