Jana Sena: ఓట్లు ఎత్తుకెళ్లే గ్యాంగ్ లను చూస్తున్నాం: పవన్ కల్యాణ్

  • టీడీపీ నాయకులు ఏఃం మాట్లాడతారోనని చూస్తున్నా
  • ఈసీకి ఫిర్యాదు చేయాలని మా నాయకుల నిర్ణయం  
  • ఓ కథనం క్లిప్పింగ్ ను జతపరిచిన పవన్

ఏపీలో ఓట్ల గల్లంతు వ్యవహారంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ ల గురించి విన్నామని, ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగ్ లను చూస్తున్నామని వ్యాఖ్యానించారు. మరి, దీని గురించి టీడీపీ నాయకులు ఏం మాట్లాడతారోనని ఎదురుచూస్తున్నానని అన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని తమ పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ ను జతపరిచారు.

  • Loading...

More Telugu News