sivaji: వస్తున్నా.. ఢిల్లీ బాసుల బూట్లు నాకి నోర్లు మొద్దుబారిపోయిన మన తెలుగు నాయకులకు గుంటూరు కారం తినిపిస్తా: శివాజీ

  • 10వ తేదీన వస్తున్నా.. మీకు తొందరగా ఉంటే ఇప్పుడే వస్తా
  • వైసీపీ నేతల్లా నేను కంగారు పడటం లేదు
  • ఢిల్లీ బాసుల బూట్లు నాకుతున్నవారి బండారం బయటపెడతా

చావుకు భయపడి పారిపోయేంత పిరికివాడిని తాను కాదని హీరో శివాజీ అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పట్టడం, వారి బూట్లు నాకుతున్న తెలుగు నేతల బండారాన్ని బయటపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే తన లక్ష్యానికి చేరువలో ఉన్నానని తెలిపారు. తాను అమెరికా పారిపోయానని, చంద్రబాబు డబ్బులు ఇచ్చారని తనపై కొందరు ఆరోపిస్తున్నారని... అమెరికాకు పారిపోవడం ఉండదని... టికెట్ ఉంటేనే ఆ దేశంలోకి ఎంట్రీ అయినా, ఎగ్జిట్ అయినా ఉంటుందని చెప్పారు.

తన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10వ తేదీన ఇండియాకు తిరిగి రావాల్సి ఉందని... మీకేమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇప్పుడే వచ్చేస్తానని శివాజీ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు కంగారు పడుతున్నట్టుగా తాను కంగారు పడటం లేదని అన్నారు. అమెరికాకు వచ్చిన తర్వాత మూడు మీటింగులు పెట్టుకున్నానని, తన కుమారుడి పని పెట్టుకున్నానని, ఆ పని కూడా పూర్తి చేసుకున్నానని తెలిపాడు.

ఢిల్లీ నేతలు మోకాళ్లపై కూర్చోమంటే మన నేతలు ఏకంగా సాష్టాంగపడుతున్నారని... ఇలాంటి నేతలను నిటారుగా నిలబెట్టాలని శివాజీ అన్నారు. వాళ్ల బూట్లు నాకి వీరి నోర్లు మొద్దుబారి పోయాయని, వీరందరికీ గుంటూరు కారం తినిపించేందుకు 10వ తేదీన వస్తున్నానని చెప్పారు. అందరూ రెడీగా ఉండాలని అన్నారు. ఎవరెవరు ఏమేం చేసుకుంటారో చేసుకోవచ్చని... అన్నింటికీ తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News