అరటి పళ్లు అడిగిన కోహ్లీ.. ఆశ్చర్యపోయిన పాలకుల కమిటీ
- మా భార్యలను మాతోనే ఉండనివ్వాలి
- జట్టు కోసం రైల్వే జట్టును రిజర్వ్ చేయాలి
- తగినన్ని అరటి పండ్లు సరఫరా చేయాలి
అరటిపండ్ల విషయంలో కోహ్లీ విజ్ఞప్తికి ఆశ్చర్యపోయిన పాలకుల కమిటీ బీసీసీఐ ఖర్చులతో అరటి పండ్లు కొనివ్వాలని టీమిండియా మేనేజర్ను అడగాలని సూచించింది. కొందరు ఆటగాళ్లు భార్యలుంటే ఆటపై శ్రద్ధ పెట్టలేరని కాబట్టి ఏకాభిప్రాయం తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. రైలు ప్రయాణాన్ని మాత్రం పాలకుల కమిటీ అంగీకరించలేదు. అయితే కోచ్ను పూర్తిగా రిజర్వ్ చేసి బ్లాక్ చేయాలని కోహ్లీ సూచించినట్టు సమాచారం.