VH: కేసీఆర్ సామాజికవర్గం అధికారులనే అందలం ఎక్కిస్తున్నారు: వీహెచ్

  • గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయం
  • జూనియర్లను ఉన్నతాధికారులుగా నియమిస్తున్నారు
  • పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీలకు రెండు సీట్లివ్వాలి

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోసారి విమర్శించారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ సామాజికవర్గం అధికారులనే అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఐఏఎస్ అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

సీనియర్ అధికారులను పక్కనపెడుతున్నారని, జూనియర్లను ఉన్నతాధికారులుగా నియమిస్తున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News