KCR: ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న కేసీఆర్

  • కంటి, పంటి పరీక్షల కోసం వెళ్లిన సీఎం 
  • ఈ రోజు ఉదయం పూర్తైన కంటి పరీక్షలు
  • వెల్లడించిన సీఎం కార్యాలయం

కంటి, పంటి పరీక్షలు చేయించుకోవడానికి నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఈ రోజు ఉదయం ఆయనకు కంటి పరీక్షలు పూర్తయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా ప్రచారంలో పాల్గొననున్న ఆయన పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచించడంతో నిన్న సాయంత్రం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం వెల్లడించింది.

  • Loading...

More Telugu News