Pawan kalyan: పొత్తుపై ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్

  • ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుందంటున్నారు
  •  ఏ పార్టీ అండ దండా మాకు అక్కర్లేదు
  • మన బలం జనం చూపిద్దాం ప్రభంజనం

జనసేనకు వైసీపీ, బీజేపీలతో పొత్తు కుదిరిందని.. సీట్ల సర్దుబాటు కూడా అయ్యిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారని.. జనసేనకు ఏ పార్టీ అండా దండా అక్కర్లేదని పవన్ పేర్కొన్నారు.

‘‘జనసేన.. ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుంది’.. అని కొందరు అంటున్నారు. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మనకు ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు. మన బలం జనం. చూపిద్దాం ప్రభంజనం’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News