Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. నిందితుడు శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్!

  • నవంబర్ 2 వరకూ విధించిన కోర్టు
  • అదుపులోకి తీసుకోనున్న పోలీసులు
  • 11 పేజీల లేఖ ఆధారంగా ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులోని ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల సందర్భంగా వాడే కత్తితో జగన్ పై దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఈ రోజు కోర్టు ముందు హాజరుపర్చగా, వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశించింది.

శ్రీనివాసరావును విచారించేందుకు వీలుగా తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తికి న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ పట్నం సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాసరావును మరికాసేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. జగన్ పై దాడికి ఎవరు పురిగొల్పారు? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? విజయలక్ష్మీ, చైతన్య అనే స్నేహితుల సాయం తీసుకుని ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? వంటి విషయాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. అలాగే 11 పేజీల లేఖపై సైతం పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు.

Andhra Pradesh
Jagan
srinivasa rao
november 02
Police
judicial rmand
attack
  • Loading...

More Telugu News