Somu: చంద్రబాబును తిరస్కరించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సోము వీర్రాజు

  • అగ్రిగోల్డ్ బాధితులపై చంద్రబాబు స్పందించలేదు
  • బాధితుల శాపం 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు తలుగుతుంది
  • చంద్రబాబు పొట్టవిప్పితే అబద్ధాలు, అవినీతి ఉంటాయి

‘బీజేపీ ధర్మపోరాట దీక్ష’లో మాట్లాడిన బీజేపీ నేత సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై చంద్రబాబు ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు. ఎంతమంది చనిపోయినా, బాధితులుగా మారినా చంద్రబాబు స్పందించలేదన్నారు. 32 లక్షలమంది బాధితుల శాపం 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు తగులుతుందన్నారు. అధికారం కోసం మామగారినే హతమార్చిన చంద్రబాబుకు 30 వేల కోట్ల రూపాయల ఆస్తులను కబళించాలనే ఆలోచన రాదని ఎందుకు అనుకోవాలన్నారు.

పొద్దున్న లేస్తే చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్నారు. పొట్ట విప్పితే మేడి పండులో పురుగులు ఉన్నట్టు చంద్రబాబు నాయుడి పొట్టవిప్పితే అబద్ధాలు, అవినీతి ఉంటాయన్నారు. చంద్రబాబుకు వాళ్ల అమ్మ బహుశా అబద్ధాలను ఉగ్గుపాలుగా పట్టించిందేమో అన్నారు.  

చంద్రబాబు అధికారమనే ఆకాంక్షకు అగ్రిగోల్డ్ బాధితులు బాధపడుతున్నారని, బాధితుల శాపం తగులుతుందన్నారు. చంద్రబాబు నాయుడిని తిరస్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 

  • Loading...

More Telugu News