jagan: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్.. అప్పటికే అక్కడకు చేరుకున్న భారతి

  • విశాఖ నుంచి శంషాబాద్ చేరుకున్న జగన్
  • జగన్ కోసం సిద్ధంగా ఉన్న అంబులెన్స్
  • భారీగా చేరుకున్న వైసీపీ మద్దతుదారులు

విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్... హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఆయన భార్య వైయస్ భారతి అక్కడకు చేరుకున్నారు. ఆయన కోసం ఇప్పటికే అధికారులు అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. ఓ డాక్టర్, ఓ నర్సును ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లనున్నారు. మరోవైపు, శంషాబాద్ విమానాశ్రయం వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News