Nara Lokesh: ఒక నిస్వార్థ నాయకుడిని కోల్పోయాం.. కిడారి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

  • మావోయిస్టుల దాడిలో మరణించిన కిడారి
  • కిడారి సేవలు చిరస్మరణీయమైనవి
  • ఆయన అకాల మరణం పార్టీకి తీరనిలోటు

ఇటీవల మావోయిస్టుల దాడిలో మరణించిన అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ఈరోజు పాడేరులో ఏపీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్దికి కిడారి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కొనియాడారు. ఒక నిస్వార్థ నాయకుడ్ని కోల్పోయామని, ఆయన అకాల మరణం పార్టీకి తీరనిలోటని మంత్రి లోకేష్ అన్నారు.

  • Loading...

More Telugu News