Chandrababu: చంద్రబాబు సర్కార్ రోజూ అబద్ధాలు చెబుతోంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్న ప్రచారం తగదు
  • ఈ ఏడాది ఏపీకి రూ.10,372 కోట్ల నిధులు వచ్చాయి
  • కేంద్రానికి వివక్ష ఉంటే ఇన్ని నిధులు వచ్చేవి కావు

చంద్రబాబు సర్కార్ రోజూ అబద్ధాలు చెబుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి ఈ ఏడాది రూ.10,372 కోట్ల నిధులు వచ్చాయని, ఎన్డీఏ నుంచి టీడీపీ తెగదెంపులు చేసుకున్నప్పటికీ భారీగా నిధులిచ్చామని అన్నారు. ఏపీపై కేంద్రానికి వివక్ష ఉంటే ఇన్ని నిధులు వచ్చేవి కావని, కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధుల విషయమై సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశానని అన్నారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని కోరారు.

  • Loading...

More Telugu News