ntr: ఎన్టీఆర్ నుంచి అలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు: త్రివిక్రమ్

  • 'అరవింద' షూటింగు ముగింపు దశలో వుంది 
  • హఠాత్తుగా హరికృష్ణ మరణించారు 
  • నేను .. నిర్మాత ఒక నిర్ణయానికి వచ్చాము  

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందింది. ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. దసరా కానుకగా ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు . ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు.

 తాజా ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ .. "ఇది ఎన్టీఆర్ కోసమే తయారు చేసిన కథ .. ఎన్టీఆర్ మాత్రమే చేయదగిన కథ అని అన్నారు. "ఈ సినిమా షూటింగు చివరిదశలో ఉండగా, హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ వార్త తెలియగానే నేను .. నిర్మాత షాక్ అయ్యాం. ఎన్టీఆర్ కోలుకోవడానికి సమయం పడుతుంది గనుక, ఆయనను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాం. సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయలేక పోతున్నాము గనుక, వేసవిలో విడుదల చేసుకుందాములే అని నిర్ణయించుకున్నాం.

 కానీ అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజున ఎన్టీఆర్ నుంచి కాల్ వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం సినిమాను రిలీజ్ చేయవలసిందే .. షూటింగును మొదలుపెట్టండి అన్నాడు. ఆయన అంకితభావానికి మేము ఆశ్చర్యపోయాము. మర్నాడు నుంచే షూటింగు చేశాము గనుకనే, చెప్పిన సమయానికి సినిమా మీ ముందుకు వస్తోంది" అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News