Chandrababu: గ్లోబల్ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డుకు ఎంపికైన చంద్రబాబు

  • రాజ్‌నాథ్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం
  • అవార్డుకు ఎంపిక చేసిన స్వామినాథన్ కమిటి
  • అన్ని అంశాల్లో ఏపీ అగ్రగామి


ఏపీ సీఎం చంద్రబాబుకు గ్లోబల్ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు దక్కింది. ఈ నెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం అంశాలను అవార్డు ఎంపిక కమిటీ అయిన డాక్టర్ స్వామినాథన్ కమిటీ పరిశీలించింది. సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్‌ వంటి అంశాలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. అన్ని అంశాల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నట్లు తేల్చిన కమిటీ ఈ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది.

  • Loading...

More Telugu News