devi neni uma: అంబులెన్స్ లో రోగులున్నారని దేవినేని ఉమ నిరూపిస్తారా?: బొత్స సవాల్

  • ఆ అంబులెన్స్ ను నేను తనిఖీ చేశాను
  • దాని డ్రైవర్ తో మాట్లాడా
  • అందులో రోగులెవ్వరూ లేరు

విజయనగరం జిల్లాలోని గుర్లలో నిన్న వైసీపీ బహిరంగసభ జరుగుతున్న సమయంలో అటుగా ‘108 అంబులెన్స్’ వచ్చిన విషయం తెలిసిందే. ఆ అంబులెన్స్ లో పేషెంట్ ఎవరూ లేరని, ప్రభుత్వ వికృత చర్యలంటూ జగన్ విమర్శించారు. ఆ అంబులెన్స్ లో గాయపడ్డ వైసీపీ కార్యకర్త ఉన్నారని మంత్రి దేవినేని ఉమ ఈరోజు సమాధానమిచ్చారు. అయితే, ఉమ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆ అంబులెన్స్ లో గాయపడ్డ వ్యక్తి ఉన్నారని ఉమ చెబుతున్నారని, ఈ విషయాన్ని ఆయన నిరూపిస్తారా? అని సవాల్ విసిరారు. ఆ అంబులెన్స్ ను తాను తనిఖీ చేశానని, అందులోని డ్రైవర్ తో మాట్లాడానని అన్నారు. అందులో రోగులెవ్వరూ లేరని బొత్స చెప్పారు.

  • Loading...

More Telugu News