Chandrababu: ఆ ఐటీ దాడులకు మీరెందుకు కంగారుపడుతున్నారు?: చంద్రబాబుకు కన్నా ప్రశ్న

  • పన్నులు ఎగ్గొట్టే సంస్థలపై ఐటీ దాడులు చేస్తున్నారు
  • ఆ సంస్థలన్నీ మీ బినామీ వనా?
  • చంద్రబాబు, లోకేశ్ లను ప్రశ్నించిన కన్నా

ఏపీలో పలు సంస్థలపై ఐటీ దాడులు జరుగుతుండటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని టీడీపీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిస్పందించారు. పన్నులు ఎగ్గొట్టే సంస్థలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేస్తుంటే, మీరెందుకు కంగారుపడుతున్నారని ప్రశ్నించారు. ఆ సంస్థలన్నీ మీ బినామీ వనా? అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లను తన ట్వీట్ లో కన్నా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News