Andhra Pradesh: అవినీతి ఆరోపణల విషయంలో మాటమార్చిన హోటల్ యజమాని.. జైలుశిక్ష, జరిమానా విధించిన కోర్టు!

  • ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఘటన
  • ప్రభుత్వ అధికారులకు లంచం కేసులో తీర్పు
  • అవినీతి నిరోధక చట్టాన్ని ఇటీవల సవరించిన కేంద్రం

సాధారణంగా ఏ కేసులో అయినా తొలుత ఏ వాంగ్మూలం అయితే ఇచ్చామో, చివరివరకూ దానికే కట్టుబడి ఉండాలి. లేదంటే కేసును గెలవడం కష్టమైపోతుంది. కానీ అవినీతి కేసులో ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేసిన ఓ హోటల్ యజమాని.. ఆ తర్వాత మాట మార్చాడు. దీంతో తిక్కరేగిన కోర్టు సదరు హోటలియర్ కు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని రేపల్లెకు చెందిన గుండు రామలింగేశ్వరరావు ఓ హోటల్ ను నిర్వహిస్తున్నాడు. ఈ హోటల్ అసెస్ మెంట్ అనుమతుల కోసం 1993లో వాణిజ్య పన్నుల అధికారులను సంప్రదించగా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా వాణిజ్యపన్నుల డీసీటీఓ మందలపు వీరయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.త్రిమూర్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే తొలుత అధికారులు లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు చేసిన రామలింగేశ్వరరావు.. ఆ తర్వాత విచారణ సందర్భంగా మాట మార్చారు.

ఈ కేసును విచారించిన విజయవాడ మూడో మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం సదరు హోటలియర్ కు షాక్ ఇచ్చింది. తొలుత సాక్ష్యం చెప్పి, ఆ తర్వాత మాట మార్చినందుకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. ప్రభుత్వ అధికారులను ఈ కేసులో నిర్దోషులుగా విడుదల చేసింది. ఏసీబీ చరిత్రలో ఇదో అరుదైన తీర్పుగా కోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం ఇటీవల ఆమోదించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం తీసుకోవడంతో పాటు ఇవ్వడం కూడా నేరమే.

Andhra Pradesh
Guntur District
hotel
owner
jail imprisonment
penalty
govt officials
ACB
  • Loading...

More Telugu News