Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న మూర్తి పార్థివ దేహం.. 8 గంటలకు విశాఖకు..!

  • మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించనున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు
  • మధ్యాహ్నం 2:15 గంటలకు అంతిమయాత్ర
  • గీతం డీమ్డ్‌ వర్సిటీ సమీపంలో అంత్యక్రియలు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహం ఈ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంది. ఉదయం 8 గంటలకు విమానంలో విశాఖపట్టణం తరలిస్తారు. అక్కడి నుంచి సిరిపురంలోని ఆయన ఇంటికి తరలించి మధ్యాహ్నం వరకు అక్కడే ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతలు, ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు.

మధ్యాహ్నం 2:15 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి రాక్‌డేల్‌ లే అవుట్‌లోని టీడీపీ కార్యాలయంలో మూర్తి పార్థివ దేహాన్ని కాసేపు ఉంచుతారు. అనంతరం  గీతం డీమ్డ్‌ వర్సిటీ సమీపంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News