Mahesh Babu: 'మహర్షి' కోసం భారీ ఖర్చుతో విలేజ్ సెట్

  • విదేశాల్లో 'మహర్షి' షూటింగ్ 
  • తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో 
  • ఏప్రిల్ 5వ తేదీన భారీ రిలీజ్  

మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూఎస్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు.

భారీ ఖర్చుతో అక్కడ విలేజ్ సెట్ ను వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు .. ఈ విలేజ్ సెట్ ను .. నిజమైన విలేజ్ లా అనిపించేలా చాలా సహజంగా తీర్చిదిద్దుతున్నారు. 'మహర్షి' టీమ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేలోగా ఈ సెట్ ను పూర్తి చేస్తారట. ఆ తరువాత నాయకా నాయికలు .. ఇతర నటీనటుల కాంబినేషన్లో ఈ సెట్లో షూటింగు జరుపుతారట. జయసుధ .. ప్రకాశ్ రాజ్ .. అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.           

  • Loading...

More Telugu News