Telugudesam: ఐటీ సోదాల పేరుతో కేంద్రం మైండ్ గేమ్ ఆడుతోంది: టీడీపీ ఎంపీ కనకమేడల

  • కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఏపీలో ఐటీ దాడులు
  • అధికార దుర్వినియోగంలో ముందంజలో ఉంది
  • ఏపీ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం ఆగదు

ఐటీ సోదాల పేరుతో కేంద్ర ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని, అధికార దుర్వినియోగంలో మోదీ ప్రభుత్వం ముందంజలో ఉందని ఏపీ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విరుచుకుపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఏపీలో ఐటీ దాడులు చేయిస్తోందని, కార్పొరేట్ సంస్థల్లో ఐటీ దాడులు చేసి, వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రత్యర్థులపై పగ తీర్చుకునే చర్యల్లో భాగంగా న్యాయస్థానాలను కూడా వాడుకునేందుకు వారు వెనకాడటం లేదని, బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం ఇందులో భాగమేనని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలు, ఏపీపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై తాము నిలదీస్తున్నందుకే ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News