ntr: జనవరి నుంచి రాజమౌళి రెగ్యులర్ షూటింగ్

  • రాజమౌళి నుంచి భారీ బడ్జెట్ చిత్రం
  • సిద్ధమవుతోన్న భారీ సెట్లు  
  • టైటిల్ విషయంలో అందరిలో ఆసక్తి

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి ప్రత్యేకమైన భారీ సెట్స్ అవసరం కావడంతో, రామోజీ ఫిల్మ్ సిటీలోను .. అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోను వేస్తున్నారు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు .. కథానాయికలు ఎవరనేది ప్రకటించలేదు. ఈ రెండు విషయాలు కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నవంబర్ చివరివారంలో గానీ.. డిసెంబర్ మొదటి వారంలో గాని ఈ సినిమాను లాంచ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఫస్టు షెడ్యూల్లో ఎన్టీఆర్ .. ఆ తరువాత షెడ్యూల్లో చరణ్ పాల్గొంటారట. ఇంతవరకూ తెలుగులో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్ తో రాజమౌళి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

  • Loading...

More Telugu News