ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పొడవు, జానారెడ్డి అంత ఎత్తు లేకున్నా జగదీశ్ రెడ్డి గట్టోడే: కేసీఆర్
- జిల్లాకు పవర్ ప్రాజెక్టు కావాలని అడిగిన ఏకైక నేత
- మరో రెండు నెలల్లోనే అందుబాటులోకి
- 8 వేల మందికి ఉపాధి అవకాశాలు
దామరచర్ల వద్ద నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టు మరో రెండు నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.29,965 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు. ప్లాంట్ పూర్తయితే 8 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.