సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అలాంటి సినిమాలు చేయనంటున్న రష్మిక
- 'శభాష్ నాయుడు' మొదలెట్టనున్న కమల్
- చివరి షెడ్యూలులో నిఖిల్ 'ముద్ర'
* కొన్నాళ్ల క్రితం ప్రముఖ నటుడు కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో 'శభాష్ నాయుడు' పేరిట ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఈ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు త్వరలో దీని షూటింగును తిరిగి ప్రారంభించడానికి కమల్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందులో కమల్ తో పాటు శ్రుతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు.
* తమిళ దర్శకుడు టీఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న 'ముద్ర' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇది పూర్తవగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.