ntr: 'అరవింద' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అందుకే రాలేదు: పూజా హెగ్డే

  • షూటింగు కారణంగా జైసల్మేర్ లో వున్నాను 
  • ముందుగా కమిటైన షూటింగ్ అది 
  • ఎన్టీఆర్ ఎమోషన్స్ ను అర్థం చేసుకున్నాను  

'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, నిన్న రాత్రి హైదరాబాద్ - నోవాటెల్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుకకి పూజా హెగ్డే రాకపోవడం చాలామంది అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో తొలిసారిగా వస్తోన్న సినిమా కావడంతో ఆమె వస్తే బాగుండేదని అనుకున్నారు.

ఈ విషయంపై పూజా హెగ్డే స్పందిస్తూ .. "ముందుగా కమిటైనట్టుగా ఒక షూటింగులో పాల్గొనవలసి వచ్చింది. ప్రస్తుతం జైసల్మేర్ లో షూటింగు జరుగుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయాను. షూటింగు గ్యాప్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫాలో అవుతూనే వచ్చాను. ఎన్టీఆర్ మాటలు మనసును కదిలించి వేశాయి. తెలుగులో ఎన్టీఆర్ ప్రతి మాట నాకు అర్థం కాకపోవచ్చును గానీ, ఆయన ఫీలింగ్ ను నేను కూడా అనుభవించాను" అని చెప్పుకొచ్చిది.  

  • Loading...

More Telugu News