Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మాస్ పాత్రలూ చేస్తానంటున్న కీర్తి 
  • కన్నడ సినిమాలో ఈషా రెబ్బా 
  • విలన్ గా నటిస్తున్న రచయిత 
  • పరశురాంతో మైత్రీ మూవీస్ సినిమా

*  ఫలానా తరహా పాత్రలకే తాను పరిమితం కాదలచుకోలేదని అంటోంది అందాలభామ కీర్తి సురేశ్. "మాస్ తరహా పాత్రలు కూడా చేయాలి కదా, అందుకే స్వామి, పందెంకోడి 2 చిత్రాలలో ఆ తరహా పాత్రలు చేశాను. ఆర్టిస్టన్నాక అన్ని పాత్రలూ చేయాలి. అప్పుడే పెర్ఫెక్ట్ అవుతాం. నా ప్రయత్నం అదే' అని చెప్పింది.
*  తాజాగా 'అరవింద సమేత' చిత్రంలో నటించిన టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఇప్పుడు కన్నడ చిత్ర రంగానికి కూడా వెళుతోంది. సూపర్ స్టార్ శివరాజకుమార్ హీరోగా రూపొందే చిత్రంలో ఈషా నాయికగా నటిస్తుందట.
*  ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఆర్టిస్టుగా మారుతున్నాడు. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రంలో అబ్బూరి రవి విలన్ పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
*  తాజాగా 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన పరశురాం తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించడానికి అంగీకరించారు. ఇప్పటికే ఈయన గీతా ఆర్ట్స్ లో మరో చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News