Narendra Modi: మోదీ కుటుంబ సభ్యుల గురించి కొత్త విషయం చెప్పిన త్రిపుర సీఎం!

  • ప్రధాని సోదరుడు ఆటో నడుపుతున్నారని వ్యాఖ్య
  • తల్లి చిన్న గదిలో నివసిస్తోందని వెల్లడి
  • పరాక్రమ్ పర్వ్ లో ముఖ్యమంత్రి

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ తీరే వేరు. కొత్త కొత్త విషయాలు.. మనం ఎప్పుడూ విననటువంటి తమాషా కబుర్లు అప్పుడప్పుడు ఆయన నోటి నుంచి వస్తుంటాయి. 'అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయష..' అంటూ గురజాడగారు చెప్పినట్టుగా, 'మహాభారత కాలంలోనే మనవాళ్లు ఇంటర్నెట్ వాడారు.. అప్పట్లోనే కృత్రిమ ఉపగ్రహాలు తయారుచేశారు..' అంటూ ఆమధ్య ఈ ముఖ్యమంత్రి వర్యులు సెలవిచ్చి, విమర్శకుల నోటికి గట్టి పనిచెప్పారు.

తాజాగా బిప్లవ్ కుమార్ దేవ్ మన ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబం గురించి ఎవరికీ తెలియని విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మోదీ సోదరుల్లో ఒకరు ఆటోరిక్షా నడుపుతారని, మరొకరు కిరాణా దుకాణం నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, మోదీ తల్లి ఇప్పటికీ 10/12 పరిమాణంలోని చిన్న గదిలో నివాసం ఉంటున్నారని, ఈ ప్రపంచంలో మోదీలాగా నిరాడంబరంగా జీవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు.

సర్జికల్ దాడులు జరిగి రెండేళ్లు గడచిన సందర్భంగా అగర్తలాలో పరాక్రమ్ పర్వ్ సభను ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ సీఎంగా మోదీ 13 ఏళ్లు పనిచేశారని, అయినా వారి సోదరుల్లో ఒకరు ఆటోను, మరొకరు కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు.   

  • Loading...

More Telugu News