Jaghityala: ఆస్తితగాదా నేపథ్యంలో కొడుకుపై దాడిచేయించిన తండ్రి?

  • ఆటోలో వెళ్తుండగా దారికాసి దౌర్జన్యం
  • కారంపొడి చల్లిన అనంతరం దాడి
  • తండ్రితోపాటు నలుగురిపై ఫిర్యాదు చేసిన బాధితుడు

తండ్రీకొడుకుల మధ్య ఆస్తితగాదా నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. తన తండ్రే ఈ దాడి చేయించాడని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమికొండకు చెందిన చిలుముల మైసయ్య, లక్ష్మీరాజ్యంలు తండ్రీకొడుకులు. వీరిమధ్య గత కొన్నాళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం లక్ష్మీరాజ్యం ఆటోలో ప్రయాణికులను తీసుకుని వెళుతూ గంగాధరం ప్రధాన కూడలిలో వాహనాన్ని నిలుపుచేశాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లక్ష్మీరాజ్యం ముఖంపై కారంపొడి చల్లి దాడిచేసి వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన లక్ష్మీరాజ్యం ఇది తన తండ్రి చేయించిన పనేనని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి మైసయ్యతోపాటు ఇసాక్‌, మారంపల్లి హైజాక్‌, సుశిత కలిసి ఈ దాడికి పాల్పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News