రాజమహేంద్రవరంలో అర్ధరాత్రి పేలుడు.. మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం!
- లాలా చెరువు సమీపంలోని ఇంటిలో పేలుడు
- దీపావళికి బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు
- అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
దీపావళి పండుగ కోసం మందుగుండు తయారు చేస్తుండగా పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతుండగా, గ్యాస్ సిలిండర్ పేలిందని తీవ్ర గాయాలపాలైన ముత్యాల రెడ్డి తెలిపాడు. పేలుడులో మృతి చెందిన ధనలక్ష్మితో పాటు గాయపడిన కర్రి వైష్ణవి, దేవాడ ముత్యాల రెడ్డి, దుర్గా మణి కుమార్, వినయ్రెడ్డి, సూర్యకాంతంలు ఒకే కుటుంబానికి చెందిన వారు. క్షతగాత్రులకు 90 శాతం శరీరం కాలిపోయినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.