ntr: రాజమౌళి సినిమాకి మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రా?

  • రాజమౌళి మూవీకి రెడీ అవుతోన్న సెట్స్ 
  • బ్రిటీష్ కాలం నేపథ్యంలో సాగే కథ
  • వచ్చేనెలలో షూటింగ్ మొదలు      

అపజయమెరుగని దర్శక ధీరుడిగా రాజమౌళి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా ఆయన ఒక మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా వున్నారు. ఈ సినిమా కథ బ్రిటీష్ కాలానికి చెందినదని తెలుస్తోంది. అందువలన సంభాషణలు మరింత ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి.ఈ సినిమాకి సంభాషణలను అందించే బాధ్యతను బుర్రా సాయిమాధవ్ కి అప్పగించినట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి బ్రిటీష్ కాలానికి చెందిన సెట్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో .. అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో సిద్ధం చేస్తున్నారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.    

  • Loading...

More Telugu News