Anantapur District: ప్రబోధానంద బలవంతుడు.. అందుకే నాపై దాడిచేశాడు!: జేసీ దివాకర్ రెడ్డి

  • ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన జేసీ
  • ఆశ్రమంలో అక్రమాలపై వీడియోలు, ఆధారాల అందజేత
  • చంద్రబాబు ఏ విషయాన్నీ తేల్చిచెప్పరని విమర్శ

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు. చిన్నపొడమల గ్రామంలో ప్రబోధానంద స్వామి వర్గీయులకు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణ విషయమై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్న తీరును, పోలీసుల వ్యవహారశైలిని జేసీ చంద్రబాబుకు వివరించారు. అనంతరం సచివాలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రబోధానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశారని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఏ సమస్యపై అయినా చంద్రబాబు తొందరగా తేల్చి చెప్పరని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్య ఉందా? లేదా? అన్న విషయాన్ని హోంమంత్రి చినరాజప్పనే అడగాలని మీడియాకు సూచించారు. తాను చెప్పాల్సిన విషయాలు చంద్రబాబుకు చెప్పేశానని దివాకర్ రెడ్డి అన్నారు.

Anantapur District
PRABODHANANDA
JC DIWAKAR REDDY
Chandrababu
Andhra Pradesh
MEET
COMPLAINT
Police
Chief Minister
  • Loading...

More Telugu News