Pakistan: దుబాయ్ కి బయలుదేరిన పాక్ ప్రధాని... హైటెన్షన్ మ్యాచ్ ని దగ్గరుండి చూస్తారట!

  • నేడు చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ పోరు
  • తమ జట్టును ఉత్సాహపరచనున్న ఇమ్రాన్ ఖాన్
  • ఇప్పటికే అమ్ముడైపోయిన టికెట్లు

నేటి సాయంత్రం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ ల మధ్య ప్రారంభమయ్యే హైటెన్షన్ క్రికెట్ మ్యాచ్ ని చూడటానికి పాకిస్థాన్ ప్రధానమంత్రి, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రయాణమయ్యారు. ఆసియా కప్ లో భాగంగా ఈ పోరు సాగనున్న సంగతి తెలిసిందే. దీన్ని తిలకించేందుకు ఇమ్రాన్ దుబాయ్ వెళ్లనున్నారని, ఆయన దగ్గరుండి క్రికెటర్లను ఉత్సాహపరుస్తారని పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ మ్యాచ్ కి సంబంధించిన అన్ని టికెట్లూ ఇప్పటికే అమ్ముడైపోయాయి. దుబాయ్ స్వతహాగానే పాకిస్థాన్ కు మద్దతు పలుకుతుంది. అయితే, ఈ మ్యాచ్ ని చూసేందుకు అక్కడున్న అసంఖ్యాకమైన భారతీయులు, వారి సంతతి టికెట్లను కొనుగోలు చేయడంతో స్టేడియంలోని గ్యాలరీలన్నీ కిక్కిరిసిపోవడం ఖాయం.

  • Loading...

More Telugu News