Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రియుడితో కలసి నయన్ తీర్థయాత్ర
  • మరో సినిమాకు రెడీ అవుతున్న భరణి 
  • మలయాళంలో 'అర్జున్ రెడ్డి' రీమేక్ 
  • రీమిక్స్ సాంగ్ లో తమన్నా లేదట! 

*  నిన్నటి వరకు తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ తో కలసి విదేశాల్లో ప్రేమయాత్ర చేసిన కథానాయిక నయనతార, తాజాగా అతనిని తీసుకుని అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. గతంలో కూడా ఆమె ఈ గోల్డెన్ టెంపుల్ కి వెళ్లినప్పటికీ, ఈసారి జంటగా వెళ్లడం విశేషం.
*  ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి ఆరేళ్ల క్రితం దర్శకత్వం వహించిన 'మిథునం' చిత్రానికి ఎన్నో ప్రశంసలు లభించిన సంగతి విదితమే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుందని భరణి చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.  
*  విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళంలోకి కూడా దీనిని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క కన్నడ రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
*  నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా రూపొందుతున్న 'సవ్యసాచి' చిత్రం కోసం రీమిక్స్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. 'అల్లరి అల్లుడు' సినిమాలోని 'నిన్ను రోడ్డు మీద చూసిన లగాయత్తు..' పాటకు ఇది రీమిక్స్. ఈ పాటలో తమన్నా నటిస్తుందని మొదట్లో వార్తలొచ్చినప్పటికీ, ఇప్పుడు హీరో హీరోయిన్లపైనే దీనిని చిత్రీకరిస్తున్నారట

  • Loading...

More Telugu News