West Godavari District: పాతబాకీ తీర్చమన్నందుకు హత్యాయత్నం!

  • పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో దారుణం
  • తీవ్రంగా గాయపడిన బాధితుడు
  • రాజమండ్రి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

అప్పు తీర్చమని అడిగిన పాపానికి రుణదాతపై ఏకంగా హత్యాయత్నం చేశాడో ప్రబుద్ధుడు. అతనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (50) కిళ్లీ కొట్టు నిర్వహిస్తున్నాడు. వంశీ అనే యువకుడు అతని వద్దకు సిగరెట్‌ కొనేందుకు వచ్చాడు. ఆ సందర్భంలో పాతబాకీ కట్టాలని శ్రీనివాస్‌ పట్టుబట్టాడు. దీంతో ఆగ్రహోదగ్రుడైన వంశీ అక్కడే ఉన్న పెట్రోల్‌ శ్రీనివాస్‌పై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News