amit shah: ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా

  • 15వ తేదీన తెలంగాణ పర్యటన
  • రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్న అమిత్
  • మహబూబ్ నగర్ సభలో పాల్గొననున్న అధినేత 

ఈ నెల 15వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇన్ఛార్జీలు, అధ్యక్షులతో సమావేశమై, సూచనలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగసభలో పాల్గొంటారు. దీనికి తోడు 29న కరీంనగర్ లో నిర్వహించే బహిరంగసభలో కూడా ఆయన పాల్గొంటారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగే విధంగా పార్టీ శ్రేణులను ఆయన సమాయత్తం చేయనున్నారు.

  • Loading...

More Telugu News