Telangana: టీ.కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలు ఇవే.. ముందస్తుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్!

  • ఉత్తమ్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో అంశాలను రూపొందించిన కమిటీ
  • మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక అంశాలు
  • ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి అదనంగా 3 లక్షలు
  • అన్ని రకాల పెన్షన్ల మొత్తం రెట్టింపు

అసెంబ్లీ రద్దు దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో... టీకాంగ్రెస్ కూడా ముందస్తుకు సమాయత్తమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఈరోజు భేటీ అయింది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీ...  ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను ఖరారు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతున్నామో స్పష్టతనిచ్చింది. సమావేశానంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వివరాలను వెల్లడించారు.

టీ.కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే...
  • 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా
  • గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇప్పుడు అదనంగా రూ. 2 లక్షలు
  • ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ... ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు. 
  • ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • కల్యాణలక్ష్మి సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
  • అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న మొత్తాలు రెట్టింపు
  • విద్య, వైద్య సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు

  • Loading...

More Telugu News