KTR: అదే జరిగి ఉంటే... పాలమూరు జిల్లా మరో కోనసీమ అయి ఉండేది!: కేటీఆర్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-15b563ec9d6e62016c20926a59accbcb8b1c2434.jpg)
- కేసీఆర్ లాంటి సీఎం కావాలని ఆంధ్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు
- సమైక్యాంధ్రలో పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయింది
- దేశమంతా టీఆర్ఎస్ ను ప్రశంసిస్తోంది
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు నీళ్లిస్తుంటే కాంగ్రెస్ నేతలు భరించలేకపోతున్నారని మిమర్శించారు. సమైక్యాంధ్రలో పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. కేసీఆర్ పాలనను చూసిన ఆంధ్ర ప్రజలు... ఏపీలో కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. షాద్ నగర్ లో మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, ఆడిటోరియం నిర్మాణానికి, 1700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-c1eb22f1f5f51e0f5505ee32938b09cfe7238b3d.jpg)