krish: క్రిష్ ఆ రెండు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాడట!

  • వైవిధ్యభరితమైన కథాంశంతో 'కేరాఫ్ కంచరపాలెం'
  • ఆసక్తిని రేకెత్తించే కంటెంట్ తో 'మను'
  • ఉత్సాహాన్ని చూపుతోన్న క్రిష్      

ప్రస్తుతం క్రిష్ .. 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందించే పనిలో బిజీగా వున్నాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఒక వైపున తన సినిమాకి సంబంధించిన పనులను చూసుకుంటూనే, కొత్తగా వస్తోన్న సినిమాలపై కూడా క్రిష్ దృష్టి పెడుతున్నాడు. త్వరలో రానున్న 'కేరాఫ్ కంచరపాలెం' .. 'మను' సినిమాల విడుదల కోసం తాను ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్టు స్వయంగా క్రిష్ చెప్పాడు.

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా సమర్పిస్తోన్న 'కేరాఫ్ కంచరపాలెం'లోని కొత్తదనం గురించి ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక బ్రహ్మానందం తనయుడు ప్రధానమైన పాత్రను పోషించిన 'మను' మూవీ కూడా కంటెంట్ పరంగా .. టేకింగా పరంగా కొత్తగా ఉందనే విషయం ట్రైలర్ ద్వారా అందరికీ అర్థమైపోయింది. అందువలన ఈ రెండు సినిమాలు ఎప్పుడు థియేటర్స్ కి వస్తాయా అని తాను ఎదురుచూస్తున్నట్టుగా క్రిష్ చెప్పుకొచ్చాడు.     

  • Loading...

More Telugu News