roja: వేయికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలంటూ.. హైకోర్టులో వైసీపీ నేత రోజా పిటిషన్!

  • ప్రజల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం దెబ్బతీస్తోంది
  • దీనిపై అధికారులు స్పందించలేదు 
  • జగన్ సీఎం కాగానే మండపాన్ని పునర్నిర్మిస్తాం

తిరుమలలో కూల్చివేసిన వేయికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మండపాన్ని పునర్నిర్మించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వేయికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణమని అన్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అయినా ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే వేయికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News