nandamuri: నందమూరి కుటుంబాన్ని మరింత క్షోభ పెట్టోద్దు.. మంచు మనోజ్ విజ్ఞప్తి!

  • ట్విట్టర్ లో స్పందించిన మనోజ్
  • ప్రమాద వీడియోలు చూపొద్దన్నహీరో
  • కుటుంబ సభ్యులు కుంగిపోతున్నారని ఆవేదన

ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపై హీరో మంచు మనోజ్ విచారం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మీడియా పదేపదే ప్రమాద ఘటన దృశ్యాలను చూపడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలతో నందమూరి కుటుంబాన్ని మరింత క్షోభకు గురిచేయవద్దని కోరాడు. ఈ మేరకు మనోజ్ ఈ రోజు ఓ ట్వీట్ చేశాడు.

ప్రమాద ఘటన వీడియోను మీడియాలో చూసిన అభిమానులు, కుటుంబ సభ్యులు మరింత కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలనీ.. తన విజ్ఞప్తిని మీడియా మన్నిస్తుందని ఆశిస్తున్నట్లు మనోజ్ వెల్లడించాడు. 

nandamuri
manoj
Road Accident
harikrishna
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News