Telangana: ‘తెలంగాణ’లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

  • 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
  • వెలువడ్డ ప్రభుత్వ ఉత్తర్వులు
  • హైదరాబాద్ కలెక్టర్ గా ఎం.రఘునందన్ రావు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి.11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ వివరాలు..
హైదరాబాద్ కలెక్టర్ గా ఎం.రఘునందన్ రావు, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులుగా యోగిత రాణా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా లోకేశ్ కుమార్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పాటిల్ ప్రశాంత్ జీవన్, సిద్దిపేట కలెక్టర్ గా కృష్ణభాస్కర్, ఆసిఫాబాద్ కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతులను నియమించారు. కాగా, ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఉన్న ఆమ్రపాలిని బదిలీ చేసినప్పటికీ, ప్రభుత్వం ఆమెకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ నీ బదిలీ చేశారు. ఆ జిల్లాకు కలెక్టర్ గా ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News