టీడీపీతో పొత్తు వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు: ఉత్తమ్ కు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- విపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఇరువురి మధ్య చర్చ
- ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కే నష్టం
- ముందస్తు ఎంఐఎం ఆలోచన అయి ఉండవచ్చు
ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కే నష్టం జరుగుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్రం కానీ, బీజేపీ కానీ చేసేదేమీ లేదని లక్ష్మణ్ తెలిపారు. అంతా గవర్నర్, రాష్ట్రపతి, ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ రద్దయినా ఎన్నికలను నిర్వహించాలా? వద్దా? అనే నిర్ణయం ఈసీ చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఎంఐఎం ఆలోచనే కావచ్చని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.