sensex: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వరుసగా నాలుగు రోజులుగా కొనసాగిన లాభాలకు బ్రేక్  
  • సెన్సెక్స్ కు 84.96, నిఫ్టీకి 25.65 పాయింట్ల నష్టం
  • లాభపడ్డ వేదాంత, ఓఎన్జీసీ సంస్థల షేర్లు

వరుసగా నాలుగు రోజులుగా లాభాలతో కొనసాగిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 84.96 పాయింట్ల నష్టంతో 38,251.80 వద్ద, నిఫ్టీ 25.65 పాయింట్లు నష్టపోయి 11,557.10 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. కాగా, వేదాంత, జీ ఎంటర్ టైన్ మెంట్ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. టైటాన్, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్. బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్ తదితర సంస్థల షేర్లు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News