bjp: బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ఢీకొని మహిళ మృతి.. మరో మహిళకు తీవ్ర గాయాలు!

  • గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద సంఘటన
  • రోడ్డుదాటుతున్న మహిళలను ఢీ కొట్టిన కారు
  • అక్కడికక్కడే ఒకరు మృతి..మరో మహిళకు గాయాలు

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

డివైడర్ ను ఢీ కొట్టిన కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో జీవీఎల్ ఆ కారులోనే ఉన్నారు. మరో కారులో ఆయన విజయవాడ వెళ్లారు.

  • Loading...

More Telugu News