కేరళకు సన్నీ లియోన్ 5 కోట్లు సాయం చేసిందంటూ ప్రచారం.. వాస్తవం మాత్రం ఇది!
- కేరళకు 1200 కేజీల రైస్, పప్పు పంపిన సన్నీ
- బాధితులకు ఇంకా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్న నటి
- కేరళ ప్రజలకు ఏమి అవసరమో మాకు తెలుసు
తాను, తన భర్త కలసి ఈ రోజు కేరళలోని కొంత మందికి ఆహారం అందించగలుగుతున్నామని సన్నీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళ ప్రజలకు ఏమి అవసరమో తమకు తెలుసని... వారికి ఇంకా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ముంబైలోని జుహులో కేరళ బాధితుల కోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, విరాళాలు సేకరించిన సిద్ధార్థ్ కపూర్, ప్రతీక్, సువేద్ లోహియాలు చాలా గొప్పవారంటూ కితాబిచ్చింది.